DGP Mahender Reddy: తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలుపై డీజీపీ సమీక్ష

DGP Mahender Reddy Review on Telangana Lockdown
x

డీజీపీ మహేందర్‌రెడ్డి(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Highlights

DGP Mahender Reddy: తెలంగాణలో అమలవుతోన్న లాక్‌డౌన్‌పై డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

DGP Mahender Reddy: తెలంగాణలో అమలవుతోన్న లాక్‌డౌన్‌పై డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతోందని అన్నారు. స్మాల్ టౌన్స్ నుంచి హైదరాబాద్ మహానగరం వరకు లాక్‌డౌన్ సమర్ధవంతంగా కొనసాగుతోందన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించిన డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దని డీజీపీ సూచించారు. లాక్‌డౌన్ వేళల్లో బయటికి వస్తే వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి రావాలనుకునేవాళ్లు కచ్చితంగా ఈ-పాస్‌ తీసుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories