Bhatti Vikramarka: సింగరేణి సంస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటాం

Bhatti Vikramarka: సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసేందుకు, ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Arun Chilukuri
Published on: 12 Sept 2025 5:15 PM IST
Bhatti Vikramarka: సింగరేణి సంస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటాం
X

Bhatti Vikramarka: సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేసేందుకు, ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా, లాభదాయకమైన ఇతర ఖనిజాల తవ్వకాలపై కూడా సింగరేణి దృష్టి సారించాలని ఆయన సూచించారు.

సింగరేణి సంస్థ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, కొత్త బొగ్గు బ్లాకులు, ఇతర గనులపై దృష్టి పెట్టాలని భట్టి స్పష్టం చేశారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఒక ఆక్షన్‌లో సింగరేణి సంస్థ పాల్గొందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాగి, బంగారం మైనింగ్‌ను ఏ సంస్థ చేసినా, సింగరేణికి 37.75 శాతం వాటా దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

'ఇతర గనులపై దృష్టి పెట్టకుంటే సింగరేణి నష్టపోయే ప్రమాదం ఉంది,' అని భట్టి హెచ్చరించారు. కొత్త బ్లాకులు తీసుకోకుండా, ఇతర గనులపై దృష్టి పెట్టకుండా ఉంటే సింగరేణి ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story