తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలపై విద్యాశాఖ పునరాలోచన

Department of Education Reconsiders the Dates of Inter Examinations in Telangana
x

తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలపై విద్యాశాఖ పునరాలోచన

Highlights

*జేఈఈ మెయిన్ పరీక్ష కారణంగా షెడ్యూలులో మార్పులు

Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలపై విద్యాశాఖ పునరాలోచన చేస్తోంది. ఇంటర్ పరీక్షల తేదీలపై జేఈఈ మెయిన్ షెడ్యూలులో మార్పు ప్రభావం పడే అవకాశం ఉన్నందున మరోసారి షెడ్యూల్ మార్చక తప్పనిపరిస్థితి నెలకొందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యనించారు. పరీక్షల షెడ్యూల్ పై ఇవాళ లేదా రేపు స్పష్టత ఇస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇటీవల అధికారులు నిర్ణయించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఏప్రిల్ 21 నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష కారణంగా షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసినట్టు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories