డేంజర్ జోన్లో పెద్దపల్లి జిల్లా మంథని
Peddapalli: గోదావరి నదికి పోటెత్తిన వరద ప్రభావం
డేంజర్ జోన్లో పెద్దపల్లి జిల్లా మంథని
Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం డేంజన్ జోన్లో ఉంది. బొక్కలవాగు నీటి ప్రవాహానికి లైన్ గడ్డ, మర్రివాడ, అంబేద్కర్ నగర్, దొంతులవాడ, సూరయ్యపల్లి ఎస్సీ కాలనీలు నీట మునిగాయి. గోదావరి నదికి వరద పొటెత్తటంతో ఖానాపూర్ గ్రామాన్ని అర్ధరాత్రి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెస్తపల్లి, ఎక్లాస్పూర్, ఖాన్ సాయిపేటతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలు వరద నీట మునగటంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మంథని-కాటారం రహదారి బంద్ కావటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Next Story




