వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
x
Highlights

*ఆర్టీసీ బస్సు - లారీ - ఆటో ఢీ *ఏడుగురు మృతి, పలువురికి గాయాలు *మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి దగ్గర ఘటన *కొనసాగుతున్న సహాయక చర్యలు

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు - లారీ - ఆటో ఒకదానినొకటి ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వారిని.. దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇక.. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

బయటకు వెళ్లేందుకు సిద్ధమైన ఆ కుటుంబం... కోటపల్లి-మోమిన్‌పేట్‌ రోడ్డు దగ్గరకు వచ్చి ఓ ఆటోలో ఎక్కారు. ఇక.. అదే సమయంలో ఆ ఆటో ముందు ఆర్టీసీ బస్సు వచ్చి ఆగింది. ఈ క్రమంలో బస్సును తప్పించి ఆటోను ముందుకు తీశాడు డ్రైవర్. ఆ సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీని ఆటో డ్రైవర్ గమనించలేదు. దీంతో లారీ ఢీకొట్టడంతో ఆటో మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories