CPI Narayana: గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేత నారాయణ విమర్శలు

CPI Narayana Comments On Central Government | TS News
x

CPI Narayana: గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేత నారాయణ విమర్శలు

Highlights

CPI Narayana: తెలంగాణ బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడం నుంచే.. రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్‌కు మధ్య గ్యాప్ పెరిగింది

CPI Narayana: కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు సీపీఐ నేత నారాయణ. గవర్నర్‌ వ్యవస్థ ఉత్సవ విగ్రహం లాంటిదని వీటిని ఖాతరు చేయాల్సిన అవసరం లేదన్నారు నారాయణ. గవర్నర్ వ్యవస్థ కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు సహకరించడంగా మారిపోయిందన్నారు. తెలంగాణ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య గ్యాప్ వచ్చిందన్నారు. తెలంగాణలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. అయితే గుజరాత్ పోర్టు నుంచి గంజాయి, డ్రగ్స్ దేశం మొత్తం విస్తరిస్తోందని దానిపై ఎవరూ పట్టించుకోరా అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories