తెలంగాణలో మరో 891 మందికి కరోనా నిర్ధారణ

తెలంగాణలో మరో 891 మందికి కరోనా నిర్ధారణ
x
Highlights

తెలంగాణలో కరోనా మహమ్మరి అంతకంతకూ విజృంభిస్తోంది. బుధవారం కొత్తగా 891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 719 కేసులు వచ్చాయి.

తెలంగాణలో కరోనా మహమ్మరి అంతకంతకూ విజృంభిస్తోంది. బుధవారం కొత్తగా 891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 719 కేసులు వచ్చాయి. అలాగే రంగారెడ్డి 86, మేడ్చల్ 55 , సంగారెడ్డి 2, వరంగల్ రురల్ 3 ,కామారెడ్డి 1 , కరీంనగర్ 2, ఖమ్మం 4 , సిద్దిపేట 1, భద్రాద్రి 6, సిరిసిల్ల 1, వరంగల్ అర్బన్ 3, గద్వాల్ 1, పెద్దపల్లి 1, సూర్యాపేట 1, నల్గొండ 2, నిజామాబాద్ 1, మహబూబాబాద్ 1, ఆదిలాబాద్ 1 నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 10వేల 444కు చేరింది.

మరో ఐదుగురు కరోనా భారిన పడి మరణించడంతో.. ఇప్పటివరకు మరణాల సంఖ్య 225 కు చేరింది. ఇక గత 24 గంటల్లో 157 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 4 వేల 361 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 5 వేల 858 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో కొత్తగా 4 వేల 69 టెస్టులు చేశారు. దీంతో తెలంగాణలో టెస్టుల సంఖ్య 67 వేల 318కి చేరింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories