Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు
Coronavirus updates in South India
Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,083 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,786 కి చేరింది. మృతుల సంఖ్య 530కి పెరిగింది. కరోనా నుంచి కొలుకుని తాజాగా 1114 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకోని మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 46,502 కి చేరింది. ప్రస్తుతం 17,754 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story




