గాంధీ పేరు తొలిగింపు.. ఇవాళ,రేపు కాంగ్రెస్ నిరసనలు

గాంధీ పేరు తొలిగింపు.. ఇవాళ,రేపు కాంగ్రెస్ నిరసనలు
x

గాంధీ పేరు తొలిగింపు.. ఇవాళ,రేపు కాంగ్రెస్ నిరసనలు

Highlights

జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ.. ఇవాళ, రేపు ఏఐసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది టీకాంగ్రెస్‌.

జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ.. ఇవాళ, రేపు ఏఐసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది టీకాంగ్రెస్‌. గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్రలు చేస్తోందని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా.. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు కాంగ్రెస్‌ నేతలు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌, ఇన్‌ఛార్జ్‌ నటరాజన్, మంత్రి అజారుద్దీన్‌, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పాల్గొన్నారు. రేపు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్.

Show Full Article
Print Article
Next Story
More Stories