Mahesh Kumar Goud: గాంధీభవన్లో రేపు, ఎల్లుండి జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు


Mahesh Kumar Goud
Gandhi Bhavan: గాంధీభవన్లో రేపు ఎల్లుండి టీపీసీసీ మహేష్కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి.
Gandhi Bhavan: గాంధీభవన్లో రేపు ఎల్లుండి టీపీసీసీ మహేష్కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, విష్ణునాథ్, విశ్వనాథం హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు టీపీసీసీ చీఫ్. ఆ తర్వాతి రోజైన 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఛైర్మన్ల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



