ఎవరు తీసిన గోతిలో వారే పడతారు: సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా విజయశాంతి వ్యాఖ్యలు

Arun Chilukuri
Published on: 8 Nov 2020 3:08 PM IST
ఎవరు తీసిన గోతిలో వారే పడతారు: సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా విజయశాంతి వ్యాఖ్యలు
X

ఎవరు తీసిన గోతిలో వారే పడతారని సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఫైర్ బ్రాండ్ విజయశాంతి. కాంగ్రెస్‌ నేతలను కొందరిని ప్రలోభపెట్టి, మరికొందరిని భయపెట్టి, ఒత్తిళ్లతో పార్టీ మార్పించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే చర్యల వల్ల ఇప్పుడు బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. మాణికం ఠాగూర్ మరికొంత ముందుగానే రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవని విజయశాంతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పరిణామాలను కాలం, ప్రజలే నిర్ణయించాలని వ్యాఖ్యానించారు విజయశాంతి.




Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story