ఎవరు తీసిన గోతిలో వారే పడతారు: సీఎం కేసీఆర్ టార్గెట్గా విజయశాంతి వ్యాఖ్యలు
ఎవరు తీసిన గోతిలో వారే పడతారని సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఫైర్ బ్రాండ్ విజయశాంతి. కాంగ్రెస్ నేతలను కొందరిని ప్రలోభపెట్టి, మరికొందరిని భయపెట్టి, ఒత్తిళ్లతో పార్టీ మార్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ను బలహీనపరిచే చర్యల వల్ల ఇప్పుడు బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. మాణికం ఠాగూర్ మరికొంత ముందుగానే రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవని విజయశాంతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పరిణామాలను కాలం, ప్రజలే నిర్ణయించాలని వ్యాఖ్యానించారు విజయశాంతి.
Next Story




