Madhu Yashki: టీఆర్ఎస్ ప్లీనరీపై మధు యాష్కీ సెటైర్లు

Congress Leader Madhu Yashki Comments on TRS plenary
x

Madhu Yashki: టీఆర్ఎస్ ప్లీనరీపై మధు యాష్కీ సెటైర్లు

Highlights

Madhu Yashki: టీఆర్ఎస్ ప్లీనరీపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ విమర్శల వర్షం కురిపించారు.

Madhu Yashki: టీఆర్ఎస్ ప్లీనరీపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ కు వీఆర్ ఎస్ పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్లీనరీ మొత్తం కేసీఆర్ పొగడ్తలకే పరిమితమైందని, రాష్ట్రం కోసం త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను గురించి ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు.

రాష్ట్రం వచ్చాక కేసీఆర్ వ్యాపారాలు, ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని, విదేశీ వ్యాపారాలపై బీజేపీ రైడ్స్ చేయాలని మధు యాష్కి అన్నారు. కోటి ఎకరాల మాగాణి అంటూనే వరి వేస్తే ఉరి అని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహు కాలం, రావుల కాలంలో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని మధు యాష్కీ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories