M Satyanarayana Rao: కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత

Congress Leader M Satyanarayana Rao Passed Away Today 27th April 2021 in NIMS Hospital Hyderabad
x

ఎం. సత్యనారాయణ (ఫైల్ ఫొటో)

Highlights

M Satyanarayana Rao: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (88) కన్నుమూశారు.

M Satyanarayana Rao: కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (88) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొం‍దుతూ మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఎమ్మెస్సార్‌ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఆయన స్వగ్రామం.​ ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, 3 పర్యాయాలు ఎంపీగా, 2004లో వైఎస్సార్ కేబినెట్‌లో ఎమ్మెస్సార్‌ మంత్రిగా పనిచేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెస్సార్ విసిరిన సవాల్‌తో 2006లో తొలిసారి తెలంగాణ కోసం కేసిఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎమ్మెస్సార్ సహకరించారు.

సంతాపం

సత్యనారాయణ రావు మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ సియేల్ప్ నేత జానారెడ్డి లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories