Kota Neelima: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

Kota Neelima: ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు

Shekhar G
Published on: 12 Oct 2023 8:25 AM IST
Congress Is Certain To Win The Telangana Assembly Elections Said Kota Neelima
X

Kota Neelima: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

Kota Neelima: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ను గెలిపించి సోనియాగాంధీకి బహుమతి ఇవ్వాలన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని.. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలిపారు. సనత్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన BRS నేత మధుగౌడ్‌ ఆయన అనుచరులు ఇవాళ కోట నీలిమ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. BRSలో పనిచేసిన వారికి సముచిత స్థానం లభించడం లేదనడానికి మధు గౌడ్ చేరిక నిదర్శనమన్నారు నీలిమ. అవినీతిమయమైన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలను కోరారు.

Shekhar G

Shekhar G

Next Story