TS Congress: సెకండ్ లిస్ట్‌పై కాంగ్రెస్‌ కసరత్తు

Congress Exercise On Second List
x

TS Congress: సెకండ్ లిస్ట్‌పై కాంగ్రెస్‌ కసరత్తు

Highlights

TS Congress: ఒకేసారి మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్

TS Congress: తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దాదాపు 50 మందిని ఖరారు చేసినట్టు తెలుస్తుండగా... పోటీ అధికంగా ఉన్న స్థానాలను పెండింగ్ లో పెట్టినట్టు సమాచారం. ఇవాళ మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై పెండింగ్ స్థానాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న స్థానాల నుంచి ఇప్పటికే పలువురు నేతలకు హస్తినా నుంచి పిలుపు వచ్చింది.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కేఎల్ఆర్ ఢిల్లీకి రావాలని కేసీ వేణుగోపాల్ చెప్పినట్టు సమాచారం. నిజామాబాద్ అర్బన్ టికెట్ ను మహేష్ కుమార్ గౌడ్ ఆశిస్తుండగా.. ఆ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయంపై మహేష్ కుమార్ గౌడ్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. వీళ్లతో పాటు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్న పలువురు నేతలను కూడా సంప్రదింపులు చేసి జాబితాను కొలిక్కి తీసుకుని రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇవాళ స్క్రీనింగ్ కమిటీ, రేపు కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అనంతరం అన్ని స్థానాలు కలిపి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు కాంగ్రెస్‌లో చేరనున్న రాజగోపాల్‌రెడ్డికి కూడా అధిష్టానం ఢిల్లీకి రావాలని ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఇవాళే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల లిస్టుపై మీడియా సమావేశంలో అప్డేట్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories