Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రచారం ముమ్మరం.. రెండు రోజుల్లో 40నియోజకవర్గాల్లో పర్యటన

Congress Campaign In Telangana Is In Full Swing
x

Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రచారం ముమ్మరం.. రెండు రోజుల్లో 40నియోజకవర్గాల్లో పర్యటన 

Highlights

Congress: 10మంది నేతలు రోజుకు రెండు నియోజక వర్గాల్లో ప్రచారం

Congress: తెలంగాణ కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. ఈ నెల 26,27 తేదీ లలో కాంగ్రెస్ నేతలు ఇంటింటికి ప్రచారానికి వెళ్లనున్నారు. ఈనెల 26న ఉమ్మడి వరంగల్ ,ఉమ్మడి నల్లగొండ ,హైదరాబాద్ లలో , 27న ఉమ్మడి రంగారెడ్డి , ఆదిలాబాద్, కరీంనగర్ ,మెదక్, నిజామాబాద్ లలో పర్యటన లు ఉండనున్నాయి. రెండు రోజుల్లో 40 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 10 మంది నేతలు రోజు కు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.ఇంఛార్జి ఠాక్రే ,రేవంత్ రెడ్డి, భట్టి ,ఉత్తమ్ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ ,శ్రీధర్ బాబు, మధుయాష్కీ, సీతక్క డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories