ప్రారంభానికి సిద్ధమైన కమాండ్ కంట్రోల్ భవనం
*4న కమాండ్ కంట్రోల్ భవనం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
ప్రారంభానికి సిద్ధమైన కమాండ్ కంట్రోల్ భవనం
Command Control Center: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభానికి ముస్తాబైంది. సుమారు 600 కోట్లతో భవనం నిర్మించారు. ఈనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ మహేందర్రెడ్డితో పాటు పలువురు సందర్శించారు. అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్తో మరింత భద్రత పెరుగుతుందన్నారు.
Next Story




