నేడు, రేపు మరింత చలి.. వాతావరణశాఖ హెచ్చరిక

Cold Intensity in Telangana
x

నేడు, రేపు మరింత చలి.. వాతావరణశాఖ హెచ్చరిక

Highlights

Telangana: అంతకంతకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

Telangana: తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత పది రోజులగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు పడిపోయాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో నేడు, రేపు చలి పులి పంజా విసురుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో నేడు, రేపు ఏడు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు ఏజెన్సీ జిల్లాలైన ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 10.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. పలు జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 10.7, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 11.2, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొండారెడ్డిపల్లిలో 11.7 నమోదైంది. ఇటు సంగారెడ్డి జిల్లా ఆల్మాయ్‌పేటలో 12.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆస్తమా, ఫ్లూ వంటి వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని.. జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు.. బయటకు వెళ్లకుండా.. వెచ్చటి ఉన్న దుస్తులు ధరించాలని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories