Revanth Reddy: హైదరాబాద్ డ్రగ్స్ గేట్ వేగా మారింది.. డ్రగ్స్, గంజాయి బ్యాచ్ ను వదలం

Revanth Reddy: తెలంగాణను పట్టిపీడిస్తున్న మత్తు మాఫియాను తరిమికొడుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Arun Chilukuri
Published on: 17 Sept 2025 12:03 PM IST
Revanth Reddy: హైదరాబాద్ డ్రగ్స్ గేట్ వేగా మారింది.. డ్రగ్స్, గంజాయి బ్యాచ్ ను వదలం
X

Revanth Reddy: తెలంగాణను పట్టిపీడిస్తున్న మత్తు మాఫియాను తరిమికొడుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరాల్లోనే కాదు.. పట్టణాలు. గ్రామాల్లో గంజాయి విస్తరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అండగా నిలబడితే మత్తు మాఫియాను తరిమికొడుతామన్నారు. గతంలో కొందరు హైదరాబాద్ ను గేట్ వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చారని మండిపడ్డారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నా వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు.

కృష్ణా జలాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 209 టీఎంసీల కృష్ణా నీటి కోసం చేస్తున్న న్యాయపోరాటంలో ట్రిబ్యునల్ వద్ద తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. SLBC టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొంటామన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story