నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం

CM Revanth Reddy Election Campaign In Medak Today
x

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం

Highlights

Neelam Madhu: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో ప్రచారంలో దూకుడు పెంచాయి.

Neelam Madhu: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో ప్రచారంలో దూకుడు పెంచాయి. సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తు్న్నారు. ఇందులో భాగంగానే..ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు రేవంత్‌రెడ్డి. కార్నర్‌ మీటింగ్‌లో సీఎం పాల్గొంటారు. మెదక్ పర్యటన అనంతరం రేవంత్‌ బెంగళూరు వెళ్లనున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌ నిన్న మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. మహబూబ్‌నగర్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీలో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories