Revanth Reddy: రాష్ట్రానికి KCR చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదు

Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 22 Dec 2025 11:10 AM IST
Revanth Reddy: రాష్ట్రానికి KCR చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదు
X

Revanth Reddy: రాష్ట్రానికి KCR చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదు

Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్ చేసినంత ద్రోహం.. ఏ నాయకుడు చేయలేదన్నారు. చంద్రబాబుకు అసలైన శిష్యుడు కేసీఆర్ అని ఆరోపించారు. అల్లుడు, కొడుకు గొడవడుతూ ఉండటంతో కేసీఆర్ బయటకు వచ్చారని.. లేకపోతే ఫామ్ హౌస్ లోనే ఉండేవారన్నారు.

బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మాణం చేయవద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫాం ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో కృష్ణ నదిపై ఒక్క ప్రాజెక్టు కట్టలేదని విమర్షించారు. కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story