ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ

CM KCR: ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 17 Nov 2021 5:00 PM IST
CM KCR Writes Letter to PM Modi Over Paddy Procurement
X

ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ

CM KCR: ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సీజన్‌కి సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయాలని అలాగే 2020-21 రబీలో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విన్నవించారు. వచ్చే రబీలో తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని పంజాబ్ తరహాలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ చేపట్టాలని లేఖలో కోరారు కేసీఆర్. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. రాష్ట్రాల నుంచి సేక‌రించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్ప‌ష్ట‌త ఇవ్వ‌ట్లేదు. ఏటా ఉత్ప‌త్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదు అని సీఎం లేఖ‌లో పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story