CM KCR: ఉమ్మడి నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌

CM KCR: రెండోవిడత ప్రచారంలో కారు స్పీడ్‌ పెంచిన కేసీఆర్‌

Jyothi
Published on: 15 Nov 2023 9:44 AM IST
CM KCR will Visit of Nizamabad and Medak District
X

CM KCR: ఉమ్మడి నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌

CM KCR: గులాబీ బాస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తూ.. ఎన్నికల ప్రచారం చేస్తూ.. ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక.. రెండోవిడత ప్రచారంలో భాగంగా కారు స్పీడ్‌ పెంచారు గులాబీ దళపతి. ఇవాళ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో ఇవాళ సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. బోధన్‌, నిజామాబాద్‌, ఎల్లారెడ్డి, మెదక్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Jyothi

Jyothi

Next Story