CM KCR: ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

CM KCR: ఇటీవల మరణించిన మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాల్క సురేశ్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Arun Chilukuri
Updated on: 9 Jun 2021 6:51 PM IST
CM KCR Visits Metpally
X

CM KCR: ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

CM KCR: ఇటీవల మరణించిన మెట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాల్క సురేశ్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రభుత్వ విప్ , చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను వారి కుటుంబ సభ్యులను మెట్ పల్లి లోని నివాసంలో బుధవారం సీఎం పరామర్శించారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , కొప్పుల ఈశ్వర్ , ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్ , కె ఆర్ సురేష్ రెడ్డి , వెంకటేష్ నేత , ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి , టి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , సంజయ్ కుమార్ , ఏ . జీవన్ రెడ్డి , కోరుకంటి చందర్ , దాసరి మనోహర్ రెడ్డి , సుంకె రవి శంకర్ , నోముల భగత్ , జడ్పీ చైర్మన్లు దావా వసంత , పుట్ట మధు తదితరులు ఉన్నారు .

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story