KCR: నేటి నుంచి సీఎం కేసీఆర్ ఉత్తరాది పర్యటన

CM KCR to Visit North India from Tomorrow
x

నేటి  నుంచి సీఎం కేసీఆర్ ఉత్తరాది పర్యటన 

Highlights

KCR: వారం రోజుల పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ పర్యటనకు కేసీఆర్

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి నుంచి ఉత్తరాదిలో పర్యటించనున్నారు. 10 రోజుల పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు కేసీఆర్. పంజాబ్, హర్యానాలో చనిపోయిన రైతుల కుటుంబాలకు సహాయం అందించనున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ పలువురు నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ 10 రోజుల పాటు వివిధ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సిఎం పరామర్శించనున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్ . ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సీఎం సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సిఎం కెసిఆర్ సమావేశాలు నిర్వహిస్తారు. మే 22న మధ్యాహ్నం కెసిఆర్ ఢిల్లీ నుంచి చంఢీఘర్ పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సిఎం కెసిఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.

ఇక చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సీఎం కేసీఆర్ చేపడతారు. సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను అందచేస్తారు. 26 మే ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. బెంగుళూరు నుంచి మే 27 తేదీన రాలేగావ్ సిద్ది పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సిఎం కేసీఆర్ భేటీ అవుతారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం సీఎం కేసీఆర్ షిరిడీ వెళతారు. అక్కడ నుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైద్రాబాద్ కు చేరుకుంటారు.

మే 29 లేదా 30 న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం కెసిఆర్ సంసిద్దం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సిఎం కెసిఆర్ ఆదుకోనున్నారు. పది రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీ గా పర్యటన చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories