CM KCR: నా చివరి రక్తపు బొట్టు కూడా దళితుల కోసమే

CM KCR Review Meet on Dalit Bandhu Scheme in Karimnagar
x

CM KCR: నా చివరి రక్తపు బొట్టు కూడా దళితుల కోసమే

Highlights

CM KCR: కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళితబంధు సమీక్ష ముగిసింది.

CM KCR: కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళితబంధు సమీక్ష ముగిసింది. ఇందులో భాగంగా అధికారులకు పలు సూచనలు చేశారు. లబ్ధిదారులకు దళితబంధుపై అవగాహన కల్పించాలన్నారు సీఎం. రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో సీఎం ప్రజాప్రతినిధిలకు పలు కీలక విషయాలను వెల్లడించారు.

దళితబంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. దళిత జాతి వివక్షకు సభ్య సమాజమే కారణమన్న కేసీఆర్‌ చివరి రక్తపు బొట్టు వరకూ దళితుల సమాగ్రాభివృద్ధికే పాటుపడతానన్నారు. దళితుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి అందరూ కదలిరావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పట్టుదలతో దళితుల సమగ్రాభివృద్ధి సాధిద్దామన్నారు. ఇక పట్టుబట్టి సాధించుకునే తత్వం తెలంగాణకే సొంతమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories