Bandi Sanjay: తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటయ్యారు..

Bandi Sanjay Kumar: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏకమయ్యారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 15 Dec 2022 7:38 PM IST
CM KCR AP CM Jagan Both Together Looting Telangana Says Bandi Sanjay
X

Bandi Sanjay: తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటయ్యారు..

Bandi Sanjay Kumar: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏకమయ్యారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఐదో విడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కరీంనగర్‌ గడ్డ..బీజేపీ అడ్డా అని పంచ్ డైలాగ్‌లు వేశారు. ఈ నేలలో పౌరుషం ఉందని, ధర్మం కోసం పని చేయడమే తప్ప.. విజయం కోసం అడ్డదారులు తొక్కనని చెప్పారు. రెండు రాష్ట్రాల నాయకుల చరిత్రను ప్రజలు గుర్తుంచుకోవాలని బండి సంజయ్ కోరారు. దోచుకుందాం.. కమీషన్లు దాచుకుందాం అన్నట్లుగా ఇద్దరి వ్యవహారం ఉందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story