తెలుగు రాష్ట్రాల మధ్య నేషనల్ హైవేకు లైన్ క్లియర్

తెలుగు రాష్ట్రాల మధ్య నేషనల్ హైవేకు లైన్ క్లియర్
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చింది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు 122కిలోమీటర్ల జాతీయ రహదారి...

తెలుగు రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చింది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు 122కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 80కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనుంది. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కూడా ఏర్పాటు కానుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 800కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories