TS News: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు

Central Government Notices to Telangana Govt
x

TS News: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు

Highlights

TS News: ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై కేంద్రం సీరియస్

TS News: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై సీరియస్‌ అయిన కేంద్రం.. దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. రెండు రోజుల్లోగా ఈ నిధులు చెల్లించాలని ఆదేశించింది. లేకుంటే తదుపరి వాయిదాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. గత జూన్‌లో తెలంగాణను సందర్శించిన కేంద్ర బృందాలు.. ఉపాధి హామీ పథకం నిధులను అనుమతి లేని పథకాలకు మళ్లించినట్లు గుర్తించాయి. ఉపాధి హామీ పథకం అమలు, పనుల కేటాయింపులో పలు అవకతవకలు జరిగినట్లు కేంద్రం నిర్ధారణకు వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories