Hyderabad: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 2 స్కైవేల నిర్మాణానికి లైన్‌ క్లియర్‌

Hyderabad: కేంద్ర రక్షణ శాఖ నుండి ఉత్తర్వులు ఆందాయన్న కంటోన్మెంట్ సీఈవో

Shekhar G
Published on: 2 March 2024 12:58 PM IST
Central Government Approved 2 Skyways In Secunderabad Cantonment
X

Hyderabad: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 2 స్కైవేల నిర్మాణానికి లైన్‌ క్లియర్‌

Hyderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రెండు స్కైవేల నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ స్పష్టం చేశారు. 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌లో స్కైవేల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఈవో పేర్కొన్నారు. స్కై వేల నిర్మాణం కొరకు రాజీవ్ రహదారి, ఎన్ హెచ్ 44 రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ నిర్ణయంతో జిల్లాల నుండి నగరానికి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు..వేగంగా ప్రయాణించేందుకు దోహదపడుతుందని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story