Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

CBI Notices to MLC Kavitha
x

Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

Highlights

Kavitha: సీబీఐ నోటీసులను ధృవీకరించిన ఎమ్మెల్సీ కవిత

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. TRS ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ.. సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద ఎమ్మెల్సీ కవితకు సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ అలోక్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఈనెల 6తేదీ ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామని, హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని సీబీఐ నోటీసులో పేర్కొంది. సీబీఐ నుంచి తనకు నోటీసులు అందినట్టు ఎమ్మెల్సీ కవిత ధ్రువీకరించారు. ఈనెల 6న హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానన్న కవిత, సీబీఐ అధికారులు తన ఇంటి వద్దే వివరణ తీసుకోవచ్చని విన్నవించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ అరెస్టు చేసింది. రిమాండ్ రిపోర్టులో ప్రస్తావనకు వచ్చిన 36 మందిని దశలవారీగా విచారించి వాస్తవాలను తెలుసుకోనున్నారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన 32 పేజీల నివేదికలో మూడు చోట్ల కల్వకుంట్ల కవిత పేరు ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని ఈడీ అధికారులు గుర్తించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తావనకొచ్చిన సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ED అధికారులు గుర్తించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేటు విమానాల్లో ఈ నగదు తరలించినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సౌత్ గ్రూప్ ను శరత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న 36 మంది.. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఒక కోటి 38 లక్షల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కార్యకలాపాలకు సంబంధించి ఉపయోగించిన 10 సెల్ ఫోన్లను కల్వకుంట్ల కవిత ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నెల 6 తేదీన జరుగనున్న సీబీఐ విచారణలో ఏయే అంశాలపై వివరణ తీసుకుంటారనే అంశం చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories