ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
x
Highlights

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఏసీబీ కోర్టు ఎదుట ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఉదయ్‌ సింహ...

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఏసీబీ కోర్టు ఎదుట ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఉదయ్‌ సింహ హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ క్రమంలో కేసు ఈసీ పరిధిలోకి వస్తుందని రేవంత్‌రెడ్డి తరుపు లాయర్‌ వాదన వినిపించగా కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు ఏసీబీ అధికారులు. వాదనలు, ప్రతివాదనలు విన్న ఏసీబీ కోర్టు ఈనెల 11కు తీర్పును వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories