ఎన్‌టీఎస్ఈ స్కాలర్ షిప్‌ టెస్టులకు దరఖాస్తు స్వీకరణ

ఎన్‌టీఎస్ఈ స్కాలర్ షిప్‌ టెస్టులకు దరఖాస్తు స్వీకరణ
x
Highlights

ఎన్‌టీఎస్‌ఈ (నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్) రాష్ట్రస్థాయి పరీక్ష డిసెంబరు 13న జరగనుంది. ఈ టాలెంట్ టెస్టు రాయాలనుకునే ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబరు...

ఎన్‌టీఎస్‌ఈ (నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్) రాష్ట్రస్థాయి పరీక్ష డిసెంబరు 13న జరగనుంది. ఈ టాలెంట్ టెస్టు రాయాలనుకునే ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబరు 12వ తేదీలోపు https://www.bse.telangana.gov.in/NTSE.aspx వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోసుకోవచ్చు. ఈ పరీక్షలను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా రాయొచ్చు. ఈ పరీక్షను రాసి రాష్ట్రస్థాయిలో అర్హత సాధించిన వారికి 2021 జూన్‌ 13న జాతీయస్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షతో కూడా సాధించిన విద్యార్ధులు రెండేళ్లపాటు ప్రతి నెల ఇంటర్‌ రూ.1250, డిగ్రీ నుంచి పీజీ వరకు నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుతుంది.

ముఖ్యమైన సమాచారం:

అర్హత

ఓపెన్ స్కూల్లో చదివిన వారితో పాటు గుర్తింపు పొందిన అన్ని స్కూళ్లకు చెందిన పదోతరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు : రూ.100

పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది : నవంబర్‌ 10, 2020

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేది : నవంబరు 12, 2020

ద‌ర‌ఖాస్తు ప్ర‌తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేది : న‌వంబ‌రు 18, 2020

పరీక్ష కేంద్రాలు : అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహిస్తారు.

వెబ్‌సైట్ : https://www.bse.telangana.gov.in/NTSE.aspx

పరీక్ష తేదీ : స్టేజ్-1 పరీక్షలు డిసెంబర్‌ 13, 2020

పేపర్ -1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తారు.

పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు.

ఎంపిక విధానం:

ఎన్‌టీఎస్ఈ పరీక్ష రెండు దశల్లో నిర్వహిస్తారు.

మొదటిది రాష్ట్రస్థాయి స్టేజ్-1,

రెండోది స్టేజ్-2 జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు.

1. రాష్ట్రస్థాయి స్టేజ్-1 పరీక్ష

రాష్ట్రస్థాయిలో జరిగే స్టేజ్-1 పూర్తి ఆబ్జెక్టివ్ త‌రహా పరీక్ష.

ఒక్కో పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.

మొత్తం స్కాలర్‌షిప్‌లలో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 4 శాతం పీహెచ్‌, 27 శాతం ఓబీసీలకు మంజూరు చేస్తారు. అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన 2 వేల మందిని స్కాలర్‌షిప్‌న‌‌కు ఎంపిక చేస్తారు. 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తారు. డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్నప్పుడు నెలకు రూ.2000 చొప్పున, ఇంటర్మీడియట్‌లో నెలకు రూ.1250 చెల్లిస్తారు. పీహెచ్‌డీ చేరిన వారికి యూజీసీ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories