Tamilisai: రాజ్‌ భవన్‌లో గవర్నర్ తమిళ సై ని కలిసిన బీఆర్ఎస్ నేతలు

Tamilisai: తీర్పు కాపీని గవర్నర్ కు అందజేసిన నేతలు

Shashank Gullapelli
Published on: 11 March 2024 6:28 PM IST
BRS Leaders Met Governor Tamilisai At Raj Bhavan
X

Tamilisai: రాజ్‌ భవన్‌లో గవర్నర్ తమిళ సై ని కలిసిన బీఆర్ఎస్ నేతలు

Tamilisai: బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు రాజ్‌భవన్‌ లో గవర్నర్ తమిళ సైని కలిసారు. అనంతరం గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంపై ఇటీవల హై కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని అందజేశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని గవర్నర్ ను కోరారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రకటించిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ తిరస్కరించగా..వారు హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని తీర్పు వెలువరించిన కోర్టు కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని పేర్కొంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story