TS BJP: దసరా తర్వాత తెలంగాణకు బీజేపీ అగ్ర నేతలు

BJP Top Leaders For Telangana After Dussehra
x

TS BJP: దసరా తర్వాత తెలంగాణకు బీజేపీ అగ్ర నేతలు

Highlights

TS BJP: 31న తెలంగాణకు యూపీ సీఎం యోగి

TS BJP: తెలంగాణపై బీజేపీ అగ్ర నేతలు ఫోకస్ పెట్టారు. దసరా తర్వాత కమలం నేతలు రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రాష్ట్రంలో ఐదు బహిరంగసభల్లో మోడీ ప్రసంగించనున్నారు. 5 లక్షల జనసమీకరణ బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఈనెల 27న అమిత్‌షా సభ జరగనుంది. 15పైగా సభలో అమిత్ షా, జేపీ నడ్డాలు పాల్గొననున్నారు. 28,29తేదీల్లో అసోం సీఎం హిమంత బిస్వ శర్మ ప్రచారం జరుపుతారు. 31న తెలంగాణలో యూపీ సీఎం యోగీ ప్రచారం నిర్వహిస్తారు. యడ్యూరప్ప, దేవేంద్ర పడ్నవిస్, అర్జున్ ముండా, చిరాగ్ పాశ్వాన్, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. అగ్ర నేతల పర్యటన కోసం బీజేపీ నాలుగు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories