BJP: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య సెగ.. డీజీపీ ఆఫీస్ ముట్టడితో రణరంగమైన లక్డీకాపూల్!

BJP: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య సెగ.. డీజీపీ ఆఫీస్ ముట్టడితో రణరంగమైన లక్డీకాపూల్!
x
Highlights

BJP: మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి.

BJP: మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ మరణానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో లక్డీకాపూల్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రణరంగంగా మారిన డీజీపీ ఆఫీస్ పరిసరాలు

భారీ సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో విధుల్లో ఉన్న ఖైరతాబాద్‌ డీసీపీ శిల్పవల్లి అదుపుతప్పి కిందపడిపోయారు. పోలీసులు నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.

కాంగ్రెస్‌పై బీజేపీ నేతల ధ్వజం

పోలింగ్‌కు ముందు తమ పార్టీ అభ్యర్థిని భయభ్రాంతులకు గురిచేసి ఆత్మహత్యకు ఉసిగొల్పారని బీజేపీ నేతలు ఆరోపించారు. "మహదేవప్ప ఆత్మహత్య కాదు.. అది కాంగ్రెస్ చేసిన రాజకీయ హత్య" అని నినాదాలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కేసును నిష్పక్షపాతంగా విచారించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రస్తుతం డీజీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరసనలో పాల్గొన్న పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories