సీఎం కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా

సీఎం కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా
x
Highlights

తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భూమిపూజ చేశారు. వర్చువల్‌ వేదికగా దిల్లీ నుంచి ఆయన భూమిపూజలో...

తెలంగాణ జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భూమిపూజ చేశారు. వర్చువల్‌ వేదికగా దిల్లీ నుంచి ఆయన భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జేపీ నడ్డా వ్యాఖ్యలు యధావిధిగా.. 45వేల కోట్లకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారు. గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటో కేసీఆర్ చెప్పాలి. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదు. కరోనాను కట్టడి చేయకుండా సీఎం‌ కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారు.

హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదు. కరోనా టెస్టులు చేయటంలో తెలంగాణ వెనుకబడిపోయింది. లోక్ సభ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారు. కోవిడ్ ను ఎదుర్కొనే క్రమంలో కేంద్రానికి దేశ ప్రజలు సహకరించాలి. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని కేంద్రం పనిచేస్తోంది. కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన. ప్రధాని మోదీ ఆలోచన మేరకు పార్టీ కార్యాలయాల నిర్మాణం. కోవిడ్ ను ఎదుర్కోవటంలో ప్రధాని మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు అని జేపీ నడ్డా అన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories