కరీంనగర్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
కరీంనగర్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలం రమేష్ వర్గం త్వరలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సంప్రదింపులన్నీ పూర్తయ్యాయి. మరోవైపు పలువురు కార్పొరేటర్లు, సర్పంచ్లు సైతం బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరో నెల రోజుల్లో బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని జిల్లా బీజేపీ నాయకులు చెబుతున్నారు.
Next Story




