Raghunandan Rao: సాయంత్రంలోగా చంపేస్తాం.. ఎంపీ రఘునందన్‌కు బెదిరింపు కాల్‌

Raghunandan Rao: సాయంత్రంలోగా చంపేస్తాం.. ఎంపీ రఘునందన్‌కు బెదిరింపు కాల్‌
x
Highlights

Raghunandan Rao: తెలంగాణలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు సంచలనంగా మారిన బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది.

Raghunandan Rao: తెలంగాణలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు సంచలనంగా మారిన బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పేరుతో ఓ వ్యక్తి కాల్‌ చేసి, "ఈ సోమవారం సాయంత్రం వరకు నిన్ను చంపేస్తాం" అంటూ హెచ్చరించాడు.

ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ హాజరైన సమయంలోనే ఈ కాల్‌ వచ్చింది. ఫోన్‌ను ఎంపీ పీఏ లిఫ్ట్ చేయగా, కాల్‌లో ఉన్న వ్యక్తి తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునని తెలిపి, ప్రాణ హానికి పాల్పడతానని బెదిరించాడు.

ఈ విషయాన్ని వెంటనే డీజీపీ, మెదక్‌ జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులకు ఎంపీ రఘునందన్‌ తెలియజేశారు. బెదిరింపు కాల్‌ నేపథ్యంలో పోలీసులు ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. కాల్‌ను ట్రేస్‌ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories