Dharmapuri Arvind: ఒవైసీ శాసిస్తడు.. కేసీఆర్ పాటిస్తడు.. ముస్లింల కోసమే గ్రూప్ 1 పరీక్షను..

BJP MP Dharmapuri Arvind Slams CM KCR
x

Dharmapuri Arvind: ఒవైసీ శాసిస్తడు.. కేసీఆర్ పాటిస్తడు.. ముస్లింల కోసమే గ్రూప్ 1 పరీక్షను..

Highlights

Dharmapuri Arvind: రంజాన్ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లింలకు పెద్ద తోఫా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు.

Dharmapuri Arvind: రంజాన్ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లింలకు పెద్ద తోఫా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. ముస్లింలను గ్రూప్ వన్ ఆఫీసర్లు చేసేందుకే గ్రూప్ 1 పరీక్షను ఉర్దూ లో నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రజాకార్ల పాలనకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఓ మతానికి లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని ధర్మపురి ఆరోపించారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒవైసీ శాసిస్తే కేసీఆర్ పాటిస్తున్నారని, దీనిపై హిందూ సమాజం మేల్కోవాలని అర్వింద్ పిలుపిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories