Raja Singh: సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: గోషామహల్‌లో మజ్లీస్, బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాగిరి చేస్తున్నారు

Shekhar G
Published on: 15 Nov 2023 5:33 PM IST
BJP MLA Raja Singh Meet CEO Vikas Raj
X

Raja Singh: సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: సీఈవో వికాస్‌రాజ్‌ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు. గత ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలోని పలు బూత్‌లలో రిగ్గింగ్ జరిగినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఈసారి రిగ్గింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ వినతి పత్రం ఇచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ టీవీ, పోలీస్, సెంట్రల్ ఫోర్స్‌ ఉంచాలని ఆయన కోరారు. కొంతమంది పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గోషామహల్‌లో మజ్లీస్, బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాగిరి చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story