అసదుద్దీన్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అసదుద్దీన్కు ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదని.. బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఎంఐఎం పార్టీ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కోల్పోవడంతో అసదుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దెవా చేశారు. ఒవైసీ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు రాజాసింగ్.
Next Story




