Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి

BJP MLA Raghunandan Rao Slams Revanth Reddy
x

Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి 

Highlights

Raghunandan Rao: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైరయ్యారు.

Raghunandan Rao: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫైరయ్యారు. రేవంత్‌రెడ్డి విలువలు లేని వ్యక్తి అంటూ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తి రేవంత్ అంటూ విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి విలువలు కలిగిన వ్యక్తి అని కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమైన వ్యక్తి అంటూ అభిప్రాయపడ్డారాయన. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. మునుగోడు ఫలితం తర్వాత టీఆర్ఎస్‌ ‌ఖాళీ అవుతోందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వస్తారా లేదా అన్నది మునుగోడు ఫలితం తర్వాత తేలుతుందన్నారు రఘునందన్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories