Raghunandan Rao: కేంద్రప్రభుత్వాన్ని తూలనాడటానికే సమయం వృధా

Raghunandan Rao: శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు

Rama Rao
Published on: 12 Sept 2022 3:21 PM IST
BJP MLA Raghunandan Rao Comments On CM KCR | Telangana News
X

Raghunandan Rao: కేంద్రప్రభుత్వాన్ని తూలనాడటానికే సమయం వృధా

Raghunandan Rao: అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రహసనంగా మారిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ విచారం వ్యక్తంచేశారు. జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయాలని ఆతృతతో అన్ని భాషల్లో సీఎం కేసీఆర్ తాపత్రయం పడుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. ఎదుటివారి తప్పుల్ని ఎత్తిచూపే కేసీఆర్, శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని మదనపడ్డారు. అధికార పార్టీ నాయకుల మాటలకు విపక్షాలు వంతపాడుతున్నాయని ధ్వజమెత్తారు.

Rama Rao

Rama Rao

Next Story