Warangal: ఇవాళ వరంగల్‌లో బీజేపీ సభ

BJP Meeting in Warangal Today
x

Warangal: ఇవాళ వరంగల్‌లో బీజేపీ సభ 

Highlights

Warangal: ఆర్ట్స్ కళాశాలలో భారీ ఏర్పాట్లు, కాషాయమయమైన ఓరుగల్లు

Warangal: బీజీపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఇవాళ వరంగల్‌లో జరగనుంది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. నడ్డా శనివారం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు సతీసమేతంగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు సమీపంలోని నోవాటెల్ హోటల్ లో కాసేపు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. జేపీ నడ్డా.. హీరో నితిన్ తో భేటీ కానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర్లోని నోవాటెల్ హోటల్లో.. హీరో నితిన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే క్రికెటర్ మిథాలీరాజ్ ను కూడా జేపీ నడ్డా కలవనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ఇంకా పలువురు ప్రముఖులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం 2.40 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నడ్డా వరంగల్ కు బయలుదేరుతారు. 3 నుంచి 3.15 గంటల సమయంలో వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని బండి సంజయ్‌తో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 4.10 నుంచి 5.40 గంటల వరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. సాయంత్రం 5.55 గంటలకు వరంగల్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 6.30 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి నడ్డా వెళ్లిపోతారు. కాగా, వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రొఫెసర్‌ వెంకటనారాయణతో నడ్డా భేటీ అవుతారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర శనివారంతో ముగియనుంది. బండి సంజయ్ చివరి రోజున బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్ నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు. మామునూర్, తిమ్మాపూర్ క్రాస్ రోడ్, నాయుడు పంప్, రంగశాయి పేట, ఖిలా వరంగల్ క్రాస్ రోడ్ మీదుగా బట్టల బజార్ కు చేరుకోనున్నారు. అనంతరం వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పాదయాత్ర ముగియనుంది. సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్ట్స్ కళాశాలలో సభ నిర్వహణకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమితులైన తర్వాత తొలిసారిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నేతలు ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీ సభలో సునీల్ బన్సల్ పాల్గొనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories