జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఉద్రిక్తత

Arun Chilukuri
Updated on: 21 Jan 2021 5:45 PM IST
BJP Leaders Protest In Metpally
X

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు మెరుపు ధర్నాకు దిగారు. అయోధ్య పేరుతో బీజేపీ నేతలు బిచ్చమెత్తుకుంటున్నారని, అయోధ్య రామ మందిరానికి ప్రజలెవరూ విరాళాలు ఇవ్వొద్దన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కోరుట్ల, మెట్‌పల్లిలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాంతో, బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ శ్రేణులు కూడా ధర్నాకు దిగారు. ఇరువర్గాలు పెద్దఎత్తున చేరుకోవడంతో కోరుట్ల, మెట్‌పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story