Telangana: గులాబీ గూటికి నాగార్జునసాగర్ బీజేపీ నేతలు

BJP Leader Kadari Anjaiah Joined in TRS
x

Telangana: గులాబీ గూటికి నాగార్జునసాగర్ బీజేపీ నేతలు

Highlights

Telangana: నాగార్జునసాగర్ బీజేపీ నేత కడారి అంజయ్య తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు.

Telangana: నాగార్జునసాగర్ బీజేపీ నేత కడారి అంజయ్య తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్య సీఎం కేసీఆర్‌ను కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రవీందర్ నాయక్ తో కలిసి ఎర్రవల్లి ఫాంహౌజ్ వెళ్లిన అంజయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కడారి అంజయ్య యాదవ్‌కు.. సీఎం కేసీఆర్‌ కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అంజయ్య యాదవ్‌ చేరికతో సాగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ మరింత పటిష్టంగా తయారైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories