Alleti Maheshwar Reddy: కాంగ్రెస్‌ ఏం సాధించిందని విజయోత్సవాలు

Alleti Maheshwar Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న 'ప్రజా విజయోత్సవాల'పై బీజేఎల్పీ (BJP Legislative Party) నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 5 Dec 2025 5:22 PM IST
Alleti Maheshwar Reddy: కాంగ్రెస్‌ ఏం సాధించిందని విజయోత్సవాలు
X

Alleti Maheshwar Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న 'ప్రజా విజయోత్సవాల'పై బీజేఎల్పీ (BJP Legislative Party) నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని ఈ విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగ్గొట్టినందుకా ఈ విజయోత్సవాలు అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. "కాంగ్రెస్ పార్టీకి విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదు," అని ఆయన స్పష్టం చేశారు.

ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఇంకా మాట్లాడుతూ, ఇచ్చిన హామీల అమలులో విఫలమైనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.

ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన హామీల విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఏలేటి విమర్శించారు. హామీలను విస్మరించి, ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story