TS News: తెలంగాణపై బీజేపీ హై కమాండ్ ఫోకస్.. ఈనెల‌ 27న‌ ఖమ్మంలో అమిత్ షా సభ..?

BJP High Command Focus On Telangana
x

TS News: తెలంగాణపై బీజేపీ హై కమాండ్ ఫోకస్.. ఈనెల‌ 27న‌ ఖమ్మంలో అమిత్ షా సభ..?

Highlights

TS News: పార్టీలో అసంతృప్తి రాగాలకు పుల్‌స్టాప్ పడినట్టేనా..?

TS News: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..తెలంగాణ పై బీజేపీ హై కమాండ్ ఫోకస్ పెట్టింది. ఈనెల‌ 27న‌ ఖమ్మంలో అమిత్ షా సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. వివిధ కారణాల వల్ల ఇప్పటికే రెండు సార్లు అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా పడింది. అయితే సారి మాత్రం కచ్చితంగా అమిత్ షా పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఖమ్మం సభ వేదికగా అమిత్ షా... బీఆర్ఎస్ సర్కార్‌ను మరోసారి టార్గెట్ చేసే అవకాశముంది. ఇటు ప్రభుత్వ పరంగానూ..అటు పొలిటికల్ గానూ రెండు పార్టీల మధ్య వైరం.. పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉన్న నేపథ్యంలో.. అమిత్ షా ఖమ్మం టూర్‌ హాట్ టాపిక్‌గా మారింది..

మరోవైపు.. త్వరలో తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రలను కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, డీకే అరుణ, లక్ష్మణ్ లీడ్ చేయనున్నట్లు సమాచారం. విజయ సంకల్ప యాత్రల ద్వారా.. బీఆర్ఎస్ హామీలు, వైఫల్యాలను ఎండగడుతూనే.. కేంద్రం రాష్ట్రాభివృద్ధి కోసం మంజూరు చేస్తున్న నిధులు, ఇతరు అంశాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది..

Show Full Article
Print Article
Next Story
More Stories