Bandi Sanjay: సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
Bandi Sanjay: హిందూ సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడమే బోనాలు -బండి *సనాతన ధర్మం నవాబులది కాదు.. హిందువులది -సంజయ్
బోనాలలో పాల్గొన్న బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)
Bandi Sanjay: సనాతన ధర్మం నవాబులది కాదని, హిందువులదని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న ఆయన.. హిందూ సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికే బోనాల జాతర అని స్పష్టం చేశారు. నిజమైన భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని.. సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం మనమంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.
Next Story




